సెప్టెంబర్ 8న యువ కథానాయకుల సమరభేరి…

  • August 21, 2017 / 11:18 AM IST

ముగ్గురు యువ కథానాయకులు, ముగ్గురూ హిట్ కోసం పరితపిస్తున్నవారే. ముగ్గురి సినిమాల దర్శకులు కొత్తవారే. ఆ ముగ్గురు మరెవరో కాదు మన మంచు మనోజ్, అక్కినేని నాగచైతన్య మరియు అల్లరి నరేష్. ఈ ముగ్గురు హీరోలుగా నటించిన “ఒక్కడు మిగిలాడు, యుద్ధం శరణం, మేడ మీద అబ్బాయి” ఒకేరోజు విడుదలవుతున్నాయి. మూడు వేటికవే డిఫరెంట్ జోనర్స్ అయినప్పటికీ.. ఒకేరోజు ఈ ముగ్గురు హీరోలు తలపడడం ఎంతవరకూ శ్రేయస్కరం అనేది హీరోగారికే తెలియాలి.

మంచు మనోజ్ కథానాయకుడిగా నటించిన “ఒక్కడు మిగిలాడు” వార్ జోనర్ ఫిలిమ్ కాగా.. నాగచైతన్య “యుద్ధం శరణం” ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్. ఇక మన అల్లరి నరేష్ బాబు “మేడమీద అబ్బాయి” ఎప్పట్లానే కామెడీ ఎంటర్ టైనర్. ఈ ముగ్గురు హీరోల మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించకపోయినా.. కనీస స్థాయి విజయం సాధించకపోతే మాత్రం వారి కెరీర్లకే ప్రోబ్లమ్. హిట్ కి మొహంవాచిపోయి ఉన్న అల్లరి నరేష్, “ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో, రారండోయ్ వేడుక చూద్దాం” లాంటి వరుస హిట్స్ ఉన్నప్పటికీ సదరు హిట్ క్రెడిట్స్ తన అకౌంట్ లో పడక ఇబ్బందిపడుతున్న నాగచైతన్య, సరైన్ హిట్ రుచి చూసి చాలా రోజులైనా మంచు మనోజ్ లకి ఈ సమరం ఏమేరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ.. కచ్చితంగా నష్టం వాటిల్లకూడదని మాత్రం కోరుకుందాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus