ఆ నలుగురిని పక్కన పెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్

Advertisement

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస విజయాలతో టాలీవుడ్ టాప్ డైరక్టర్లో ఒకరిగా నిలిచారు. ఆయన తొలి చిత్రం “నువ్వే నువ్వే”లో మాత్రమే యువ హీరో తరుణ్ కనిపించారు. ఆ తర్వాత త్రివిక్రమ్  స్టార్స్ తోనే సినిమాలు తెరకెక్కించారు. చాలా కాలం తర్వాత  నితిన్ ని హీరో గా పెట్టి ‘అ..ఆ” మూవీని రూపొందించి సూపర్ హిట్ ని అందుకున్నారు. దీంతో యువ హీరోలు ఈ డైరక్టర్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్రివిక్రమ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్న వారిలో నాని, రామ్, శర్వానంద్, మంచు మనోజ్ తదితరులు ఉన్నట్లు తెలిసింది. అయితే వీరిని డైరక్ట్ చేయాలనే ఇంట్రస్ట్ మాటల మాంత్రికుడికి లేదని సమాచారం.

రెమ్యూనరేషన్లో మార్పు లేకపోయినా  చిన్న హీరోలతో సినిమా చేయడానికి అంగీకరించడం లేదని ఆయన్ను సంప్రదించిన నిర్మాతలు చెబుతున్నారు. అసలు ‘అ..ఆ” కథ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాసుకున్నది, తన తండ్రి చిత్రం కథలో మళ్ళీ కనిపించలేక ప్రిన్స్ దానిని తిరస్కరించడంతో.. ఆ స్టోరీ నితిన్ కి వచ్చిందని వారు వివరించారు. ఆ యువహీరోని ఎంచుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ హస్తం కూడా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఎవరితో సినిమా చేస్తున్న సంగతి త్రివిక్రమ్ బయట పెట్టక పోయినా.. సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు సూపర్ హిట్ కాగా, ఖలేజా అంచనాలను అందుకోలేక పోయింది. ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కసితో త్రివిక్రమ్ కష్టపడుతున్నాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news