Sadha: ఆ రెండు సినిమాలను మిస్ చేసుకుని తప్పు చేశా : సదా

  • July 8, 2021 / 05:12 PM IST

దర్శకుడు తేజ.. నితిన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘జయం’. 2002 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నితిన్ తో పాటు హీరోయిన్ సదా కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ వెంటనే ఈమెకు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో నటించిన ‘నాగ’ సినిమాలో కూడా హీరోయిన్ అవకాశం దక్కింది. అటు తర్వాత ‘ప్రాణం’ ‘దొంగ దొంగది’ ‘లీలా మహల్ సెంటర్’ ‘ఔనన్నా కాదన్నా’ వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.

‘అపరిచితుడు’ చిత్రం ఈమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే అటు తర్వాత సదా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. దానికి ప్రధాన కారణం సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలమవ్వడమే అని ఈమె ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అంతేకాదు రెండు సూపర్ హిట్ సినిమాలను కూడా ఈమె మిస్ చేసుకుందట. అవి చేసుంటే.. ఈరోజు తన కెరీర్ మరోలా ఉండేదేమో అని ఆవేదన వ్యక్తం చేసింది.సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా..

పి.వాసు డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘చంద్రముఖి’ చిత్రంలో జ్యోతిక పాత్రకు మొదట ఈమెను సంప్రదించారట.కానీ డేట్స్ అడ్జస్ట్ కాక మిస్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చింది. దీంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆనంద్’ చిత్రంలో కమలినీ ముఖర్జీ పాత్రకి కూడా మొదట ఈమెనే అనుకున్నారట.దురదృష్టవశాత్తు ఆ మూవీని కూడా ఈమె మిస్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus