అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రానున్న ఆ హీరో ఎవరో తెలుసా?

  • December 15, 2017 / 10:30 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి ముస్తాబవుతోంది. రేపు ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం అనిరుద్ కంపోజ్ చేసిన పాటల్లో రెండింటిని రిలీజ్ చేశారు. అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ క్రేజ్ నెలకొన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 19న హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరపడానికి డిసైడ్ అయ్యారు. ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని ఈ వేడుకకు ఆహ్వానించగా అందుకు తారక్ ఓకే చెప్పినట్లు తెలిసింది.

కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రానున్న సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తొలి క్లాప్ కొట్టారు. అందుకే ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కి తప్పకుండా వస్తారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. సో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా.. కుష్బూ కీలక రోల్ పోషిస్తోంది. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus