Upasana, Ram Charan: చరణ్ క్రేజ్ ను పెంచడానికి ఉపాసన అలా చేస్తున్నారా?

  • January 10, 2023 / 05:27 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకోవడంతో ఆర్.ఆర్.ఆర్ తో తన క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంచనాలకు మించి పెంచుకున్నారు. శంకర్ చరణ్ కాంబో మూవీ 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా చరణ్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చరణ్ కు క్రేజ్ మరింత పెరగాలనే ఆలోచనతో ఉపాసన పీఆర్ టీంను నియమించిందని సమాచారం అందుతోంది. ఈ నిర్ణయంతో చరణ్ క్రేజ్ ను మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. నెలలో 12 రోజుల పాటు చరణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు త్వరలో చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో కూడా నటించనున్నారని తెలుస్తోంది. బుచ్చిబాబు చరణ్ కోసం పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారని బోగట్టా.

అయితే ఈ కథ ఎన్టీఆర్ వదులుకున్న కథ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ శంకర్ కాంబో మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. చిరంజీవి, చరణ్ కాంబోలో రాబోయే రోజుల్లో మరిన్ని మల్టీస్టారర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చిరంజీవి సైతం వేగంగా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

గతేడాది చిరంజీవి నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ ఏడాది కూడా మెగాస్టార్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు రామ్ చరణ్ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు.ఈ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకుంటే మాత్రం చరణ్ స్థాయి మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus