పాన్ ఇండియా స్టార్ తో మైత్రి ప్లాన్!

  • February 11, 2021 / 12:56 PM IST

‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. దీంతో దర్శకనిర్మాతలు అతడితో సినిమాలు తీయడానికి క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోన్న ప్రభాస్ ఆ తరువాత ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాలను పూర్తి చేయనున్నాడు. అలానే నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లో ఉంది. నాగ్ అశ్విన్ సినిమా ప్రభాస్ కెరీర్ లో 23వ సినిమా. 24వ సినిమాకి కూడా ఇప్పటికే డైరెక్టర్ ఫిక్స్ అయిపోయాడని.. ప్రభాస్ టీమ్ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచిందని సమాచారం.

దాంతో పాటు ప్రభాస్ 25వ సినిమా కూడా ఓకే అయిపోయిందట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతుందని సమాచారం. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాకి దర్శకుడిగా కొరటాల శివ బాధ్యతలు తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. గతంలో ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాను డైరెక్ట్ చేశాడు కొరటాల శివ. దర్శకుడిగా కొరటాలకి అది తొలి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రభాస్ క్రేజ్ కూడా పెరిగింది.

అప్పటినుండి వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నాడు కానీ కుదరలేదు. అయితే ప్రభాస్ 25వ సినిమా మాత్రం ఖచ్చితంగా కొరటాలతో చేయాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించుకుందట. ప్రభాస్ కూడా తన కెరీర్ లో మైల్ స్టోన్ సినిమా బాధ్యతను కొరటాలకి అప్పగించడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుంది. మరి అప్పటికి ఈ లెక్కలు ఏమైనా మారతాయేమో చూడాలి!

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus