‘ఉప్పెన’లో పాట పెండింగ్!

  • February 6, 2021 / 05:56 PM IST

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ ని జరిపిస్తున్నారంటే.. సినిమా మొత్తం పూర్తయినట్లే అనుకోవాలి. కాకపోతే.. ‘ఉప్పెన’ సినిమాకి చివరి నిమిషంలో టెన్షన్ తప్పడం లేదు.

ఇప్పటికే సుకుమార్ రంగ ప్రవేశం చేసి.. మార్పులు, చేర్పులు సూచించాడని సమాచారం. దాంతో స్క్రీన్ ప్లే ఆర్డర్ మార్చడంలో దర్శకుడు, ఎడిటర్ పనిలో నిమగ్నమైపోయారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ నుండి ఇంకో టెన్షన్ మొదలైంది. దేవి తన పనిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదట. దేవి చేయాల్సిన వర్క్ కొంత పెండింగ్ లో ఉందని సమాచారం. దేవి కొన్ని సన్నివేశాలకు నేపధ్య సంగీతం బాగా ఇవ్వాలనే ఆలోచనతో కొన్ని బీజియమ్స్ రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది.

అంతేకాదు.. ఓ పాటని ఇంకా పూర్తి స్థాయిలో మిక్స్ చేయలేదని సమాచారం. ఆ పాటను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదని తెలుస్తోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ నాటికి పాటను పూర్తి చేసి విడుదల చేసే ఛాన్స్ ఉంది. లేదంటే డైరెక్ట్ గా థియేటర్లోనే చూడాలి. సుకుమార్ శిష్యుడి సినిమా కావడంతో దేవిశ్రీప్రసాద్ ‘ఉప్పెన’పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ది బెస్ట్ ఇవ్వాలని పరితపిస్తున్నాడు. కానీ యూనిట్ ని మాత్రం టెన్షన్ పెట్టేస్తున్నాడు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus