ఫిబ్రవరి 5న ‘ఉప్పెన’!

  • January 13, 2021 / 01:39 PM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’. ఈ చిత్రానికి సుకుమార్ కథ అందించగా.. శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీ రోల్ పోషించడంతో ఈ సినిమాకి కోలీవుడ్ లో కూడా మంచి హైప్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన పాటలను విడుదల చేయగా అవి మిలియన్ల వ్యూస్ దక్కించుకొని రికార్డులు క్రియేట్ చేశాయి.

హీరోయిన్ క్రితి శెట్టి ఫ్రెష్ లుక్‌తో ఆకట్టుకోవడంతో చాలా మంది ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అన్నీ సెట్ అయి సినిమా రిలీజ్ చేద్దామనుకునే టైమ్ లో కరోనా వచ్చి పడింది. దీంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. అప్పటినుండి తొమ్మిది నెలలుగా ఈ సినిమా ల్యాబ్ లోనే ఉండిపోయింది. అయితే ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నట్లు.. నెట్ ఫ్లిక్స్ తో డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తుందని అంతా అనుకున్నారు.

కానీ దర్శకనిర్మాతలు మాత్రం సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 5న ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ మంచి టైం.. ‘భీష్మ’, ‘ఛలో’, ‘మిర్చి’ లాంటి సినిమాలు ఫిబ్రవరి నెలలోనే రిలీజై సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఆ టైమ్ ను ఎంచుకున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus