లొకేషన్ కోసం రీసెర్చ్ చేస్తున్న “ఉయ్యాలవాడ” బృందం

  • June 24, 2017 / 02:05 PM IST

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో .. 151 వ సినిమాకు అంతకంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా జరుగుతోంది. పరుచూరి బ్రదర్స్ నేతృత్వంలో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి లొకేషన్ వేటలో పడ్డారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి నిజంగా తిరిగిన ప్రదేశాలు, నివసించిన ప్రాంతం వద్దకు వెళ్లి రీసెర్చ్ చేస్తున్నారు. షూటింగ్ కి వీలుకుదురుతుందా? లేదా? అని పరిశోధిస్తున్నారు. రాయల సీమలోని అనువైన లొకేషన్స్ ని సెలక్షన్ చేసే పనిలో పడ్డారు.

లొకేషన్ సెట్ అయితే  ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ ను సంగీత దర్శకుడిగా పనిచేయనున్నట్లు తెలిసింది. అంతేకాదు హీరోయిన్ గా  సోనాక్షి సిన్హా పేరు వినిపిస్తోంది. గ్రాఫిక్స్ కోసం ఏకంగా జాతీయ అవార్డు గ్రహీత కమల్ కన్నన్ ను రంగంలోకి దించారు. టాప్ టెక్నీషియన్స్, బాలీవుడ్ నటీ నటులతో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus