టాలీవుడ్ స్టార్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సినీ ప్రయాణం గురించి మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్(V.V.Vinayak) కొన్ని ఆసక్తికరమైన విషయాలు రివీల్ చేశాడు. నిన్న జరిగిన ‘బ్యాండ్ మేళం’ ప్రీ రిలీజ్ ఈవెంట్..కి వి.వి.వినాయక్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఆయన స్పీచ్ ఇస్తున్న క్రమంలో నిర్మాత, రైటర్ అయినటువంటి కోన వెంకట్తో తనకున్న బాండింగ్ను, అతని కెరీర్ సీక్రెట్స్ను బయటపెట్టాడు.’కోన వెంకట్ జర్నీ చాలా విచిత్రంగా ఉంటుందని’ వినాయక్ చెప్పారు.
ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయ్గా కెరీర్ స్టార్ట్ చేసిన కోన.. ఆ తర్వాత ఓ మినిస్టర్కు పీఏగా పని చేశారట. వాళ్ల తాత గవర్నర్ కోన ప్రభాకర్ రావు కావడం మరో ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఇదంతా వదిలేసి ఇండస్ట్రీకి ఎలా వచ్చాడో కూడా వినాయక్ వివరించారు.డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, కోన వెంకట్ మంచి ఫ్రెండ్స్ అట. ఓసారి హిందీ ” సినిమా కోసం హిందీ పాటను తెలుగులోకి రాయమని ఆర్జీవీ అడగడంతో ఆయన రైటర్గా మారారని గుర్తుచేసుకున్నారు.
ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర పని చేస్తూ, వినాయక్ సూపర్ హిట్ మూవీస్ ‘సాంబ’ ‘అదుర్స్’ సినిమాలకు డైలాగ్స్ రాశారట.కోన వెంకట్కు కనెక్టింగ్ పవర్ చాలా ఎక్కువని వినాయక్ ప్రశంసించారు. లెజెండరీ రైటర్ ఆచార్య ఆత్రేయకు కోన వెంకట్ అత్యంత సన్నిహితుడని.. అసలు వీళ్లిద్దరి మధ్య అంత స్నేహం ఎలా కుదిరిందో ఎవరికీ అర్థం కాదని వినాయక్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఏ టైమ్లో హెల్ప్ అడిగినా ఏమీ ఆశించకుండా సాయం చేసే బెస్ట్ ఫ్రెండ్ అని కొనియాడారు.
రైటర్గా సక్సెస్ అయి.. ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా మారి కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ..హిట్లు కొడుతున్న కోన వెంకట్ మరిన్ని సక్సెస్లు అందుకోవాలని వినాయక్ ఆకాంక్షించారు.