Vaisshnav Tej: వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ ఫస్ట్ లుక్.. రిలీజ్ ఎప్పుడంటే

  • August 20, 2021 / 11:58 AM IST

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఫస్ట్ సినిమా ఉప్పెన. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ సక్సెస్ కొట్టిన విషయం తెల్సిందే. టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక రోల్ చేసారు. అయితే ఈ సినిమా భారీ సక్సెస్ తరువాత ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కొండపొలం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై బిబో శ్రీనివాస్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమా టైటిల్,

ఫస్ట్ లుక్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. వైష్ణవ్ తేజ్ యాక్షన్ లుక్ లో ఆకట్టుకున్న ఈ ఫస్ట్ లుక్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా మూవీ గా దర్శకుడు క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో కటారు రవీంద్ర యాదవ్ పాత్రలో హీరో వైష్ణవ్ తేజ్ కనిపించనుండగా హీరోయిన్ రకుల్ ప్రీత్ ఒక మాస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపపొలం నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా జ్ఞానశేఖర్ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. కోట శ్రీనివాస రావు, సాయి చంద్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కానుందని టీజర్ లో యూనిట్ ప్రకటించింది. మరి ఉప్పెన తో సూపర్ హిట్ కొత్తగా పంజా వైష్ణవ్ తేజ్, ఈ కొండపొలం మూవీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus