ఆయోమయంలో వంశీ పైడిపల్లి కెరీర్.!

గతేడాది ‘మహర్షి’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు వంశీ పైడిపల్లి. ఆల్రెడీ ఓ హిట్ ఇచ్చాడు కాబట్టి… మహేష్ బాబు మళ్ళీ వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా పూర్తయ్యాక మహేష్ ‘3 నెలలు గ్యాప్ తీసుకుని వంశీతో సినిమా మొదలు పెడతాను’ అని కూడా చెప్పాడు. అయితే స్క్రిప్ట్ తో సంతృప్తి చెందలేదు.. అని ఆ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టాడు. అంటే ఇండైరెక్ట్ గా రిజెక్ట్ చేసినట్టే అని కూడా అంతా ఫిక్సయిపోయారు.

కానీ మహేష్ … పరశురామ్ తో సినిమా పూర్తయ్యేవరకూ వంశీ పైడిపల్లి ని ఆగమని చెప్పాడు అని కూడా టాక్ వినిపిస్తుంది. దీంతో స్క్రిప్ట్ పై మళ్ళీ కసరత్తులు మొదలు పెట్టాడని తెలుస్తుంది మధ్యలో మెగాస్టార్ తో ‘లూసీఫర్’ రీమేక్ చేసే అవకాశం దక్కినా వదులుకున్నాడు అని సమాచారం. మహేష్ 27 కాకపోతే ఏంటి.. మహేష్ 28 చెయ్యాలి అని ఆశతో ఉన్నాడట వంశీ పైడిపల్లి. అయితే ఇప్పుడు సడన్ గా రాజమౌళి ఎంట్రీ ఇచ్చి తన నెక్స్ట్ సినిమా మహేష్ తోనే అని ఆనౌన్స్ చేసాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయ్యాక మహేష్ తో సినిమా చేస్తాను…కె.ఎల్. నారాయణ గారు ప్రొడ్యూసర్ అని తెలిపాడు రాజమౌళి. దీంతో వంశీ పైడిపల్లి మళ్ళీ డైలమా లో పడ్డాడని వినికిడి. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ ను వచ్చే 2021 జనవరి కి విడుదల చేసే అవకాశం లేదు.. ఈ లోపు మహేష్ .. పరశురామ్ సినిమా పూర్తి చేసి.. వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ త్వరగా మొదలు పెట్టాలి. లేక పోతే మళ్ళీ వంశీ కి 3 ఏళ్ళు వెయిటింగ్ తప్పదు. ‘మహర్షి’ చిత్రానికి ముందు కూడా మహేష్ తో సినిమా చెయ్యాలి అని 3 ఏళ్ళ పైనే వెయిట్ చేసాడు వంశీ పైడిపల్లి.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus