‘మహేష్ 27’ డైరెక్టర్ మారనున్నాడా?

  • February 22, 2020 / 06:11 PM IST

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మహేష్ బాబు.. తన తరువాతి చిత్రాన్ని ‘మహర్షి’ వంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయబోతున్నట్టు ప్రకటించాడు. 3 నెలలు గ్యాప్ తీసుకుని ఆ తరువాత… మూవీ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తానని కూడా చెప్పాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి ఉందనేది తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. వంశీ పైడిపల్లి చెప్పిన స్క్రిప్ట్ మహేష్ కు అంతగా నచ్చలేదట. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ‘డాన్’ గా నేను సెట్ అవ్వను అని డైరెక్ట్ గా చెప్పేశాడట.

దీంతో వంశీ మళ్ళీ స్క్రిప్ట్ పై కసరత్తులు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. మహేష్ వంశీకి ఇచ్చిన 3 నెలల టైం అప్పుడే సగం పూర్తయ్యింది.. కాబట్టి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని ఫిలింనగర్ టాక్..! మరి మహేష్ తన 27వ చిత్రాన్ని ఏ దర్శకుడితో చేస్తాడు అనేది సర్వత్రా చర్చ నీయాంశం అయ్యింది. లైన్లో మరో ముగ్గురు దర్శకులున్నారు. ముందుగా ఉంది ప్రశాంత్ నీల్. మహేష్ ఓకే అంటే పాన్ ఇండియా సినిమా తీయడానికి రెడీగా ఉన్నాడు. ఇక రెండు సందీప్ రెడ్డి వంగా. ముందునుండే మహేష్ 27 ఈయనే ‘గీత ఆర్ట్స్’ లో తీస్తాడని టాక్ ఉంది. ఇక మూడో దర్శకుడు అనిల్ రావిపూడి. ఎక్కువగా మహేష్ .. అనిల్ తోనే సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ గ్యాప్ లో వంశీ స్క్రిప్ట్ మార్చి మంచిగా డెవలప్ చేస్తే.. ఈయనతోనే ‘మహేష్ 27’ ఉంటుంది. మరి అధికారిక ప్రకటన వస్తేనే కానీ ఏదీ కన్ఫార్మ్ అని చెప్పలేము.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus