మహేష్ కాదంటే బన్నీ ఓకే చెప్పాడా..?

  • February 1, 2021 / 12:44 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ సినిమా తీసి హిట్ అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి ఇప్పటివరకు తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టలేదు. నిజానికి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మహేష్ తోనే చేయాలనుకున్నాడు కానీ వర్కవుట్ అవ్వలేదు. చాలా కాలం పాటు మహేష్ తో పాటే జర్నీ చేసిన వంశీ తన కథతో అతడిని మెప్పించలేకపోయాడు. దీంతో మహేష్ అతడిని పక్కన పెట్టేసి మిగిలిన దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు.

దీంతో వంశీ పైడిపల్లి.. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకి కథలు చెప్పాలని తిరిగాడు. చరణ్ తో సినిమా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వంశీ తన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవల బన్నీకి పూర్తి స్క్రిప్ట్ వినిపించాడట వంశీ పైడిపల్లి. కథ నచ్చడంతో బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇదే కథను అల్లు అరవింద్ కి కూడా వినిపించి మెప్పించాల్సివుంది.

ఆయన ఓకే చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. పూర్తి స్థాయి ఎమోషనల్ యాక్షన్ సినిమాగా దీన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందించాలనేది దర్శకుడి ప్లాన్. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. దాని తరువాత కొరటాల శివతో మరో సినిమా చేయబోతున్నాడు. ఇవి పూర్తయితే గానీ వంశీకి డేట్ ఇవ్వలేని పరిస్థితి. మరి అప్పటివరకు వంశీ వెయిట్ చేస్తాడేమో చూడాలి!

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus