వంగవీటి సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మిస్సింగ్!

  • December 28, 2016 / 03:04 PM IST

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన “వంగవీటి” సినిమా ప్రారంభించినప్పుడు ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయో.. చిత్రం విడుదలయిన తర్వాత అంతకంటే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి.  గతంలో విజయవాడలో జరిగిన వర్గపోరు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 23 న విడుదలై వర్మ అభిమానులను ఆకట్టుకుంది. అయితే వంగవీటి కుటుంబ సభ్యులు, అభిమానులను మాత్రం ఆగ్రహం తెప్పించింది. రీసెంట్ అయ్యప్ప భక్తులు కూడా వర్మపై కేసు వేశారు.

ఇలా రోజుకో గొడవతో ఈ మూవీ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్ కుమార్ మాత్రం ఈ గొడవలపై స్పందించడం లేదు. కనీసం మీడియా ఎదుట కనిపించడం లేదు. దీంతో ఆయన ఎక్కడికి వెళ్లారని  టాలీవుడ్ లో చర్చ మొదలయింది. వంగవీటి అభిమానులకు భయపడి ఎక్కడైనా దాక్కున్నారా? లేకుంటే ఎవరైనా బెదిరించారా? అనే సందేహాలను ఫిల్మ్ నగర్ వాసులు వ్యక్తం చేస్తున్నారు. వీటికి సమాధానం దొరకాలంటే దాసరి కిరణ్ కుమార్ మీడియా ముందుకు రావాల్సిందే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus