మొన్న ఖుష్బూ.. ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్..!

  • December 4, 2020 / 11:47 AM IST

ఈ మధ్య కాలంలో వరుసగా స్టార్ హీరోలు మరియు హీరోయిన్ల సోషల్ మీడియా ఖాతాలను కొందరు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియా అకౌంట్ ను కూడా కొంతమంది హ్యాక్ చేసినట్టు మొన్నామధ్య చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక అటు తరువాత తమిళ్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సోషల్ మీడియా అకౌంట్ లు కూడా హ్యాక్ అయినట్టు తెలిపి..

నెటిజెన్ల సలహాలను కోరింది. ఇప్పుడు మరో తమిళ స్టార్ నటి సోషల్ మీడియా ఖాతా కూడా ఇలా హ్యాకింగ్ కు గురి అయినట్టు సమాచారం. ఆమె మరెవరో కాదు.. మన వరలక్ష్మీ శరత్ కుమార్. వివరాల్లోకి వెళితే.. వరలక్ష్మీ శరత్ కుమార్ కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విట్ట‌ర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయట. ”నిన్న రాత్రి నుండీ నా రెండు అకౌంట్స్ లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాను. అవి హ్యాక్ అయ్యాయని తెలుస్తుంది.

నా ఫాలోవ‌ర్స్‌ అందరికీ ఓ రిక్వెస్ట్.. నా అకౌంట్స్ నుండీ ఎటువంటి అసభ్యకరమైన పోస్ట్ లు వ‌చ్చినా కూడా రియాక్ట్ కాకండి. వాటిని నమ్మకండి. వీలైనంత త్వరగా నా టెక్నికల్ టీం ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేస్తారని తెలిపారు.అవి రికవరీ అయిన వెంటనే మళ్లీ మీకు తెలియజేస్తాను” అంటూ వరలక్ష్మీ చెప్పుకొచ్చింది. ఇక త్వరలోనే వరలక్ష్మీ ‘క్రాక్’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus