Varun Tej: వరుణ్ పాన్ ఇండియాపై దృష్టి పెట్టారా?

  • August 30, 2021 / 09:39 AM IST

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తొలి సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయారు. అయితే ఆ తరువాత వరుణ్ నటించిన కంచె, ఫిదా, ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు వరుణ్ తేజ్ మార్కెట్ పెరిగింది. వరుస విజయాల వల్ల యూత్ లో వరుణ్ తేజ్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

తొలిప్రేమ సినిమాతో వరుణ్ తేజ్ క్లాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గని సినిమాతో పాటు ఎఫ్3 సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కొన్ని నెలలల గ్యాప్ లోనే రిలీజ్ కానున్నాయి. ఎఫ్3 సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని గతంలో వెంకటేష్ ప్రకటించగా సంక్రాంతికి 100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరోల సినిమాలు రిలీజవుతుండటంతో ఎఫ్3 సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది.

అయితే వరుణ్ తేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా కథలపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హీరోలలో ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ ఇతర భాషల్లో ఆ సినిమా హిట్ కాలేదు. వరుణ్ తేజ్ పాన్ ఇండియా సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటాడో చూడాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus