మరోసారి నితిన్ కథతో వరుణ్ తేజ్..

  • September 19, 2016 / 11:26 AM IST

ఒక హీరో వద్దకొచ్చిన కథలు కొన్ని కారణాల వల్ల వేరే హీరోలతో తెరకెక్కుతాయి. పవన్, రవితేజ లాంటి వారితో పాటు చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇటీఐల కాలంలో వరుణ్ తేజ్, నితిన్ విషయంలోనూ జరిగిందదే. వరుణ్ హీరోగా పరిచయం అవుతున్నట్టు వార్తలొచ్చిన సమయంలో పూరి జగన్నాధ్ తో సినిమా అని ప్రచారం జరిగింది. కారణాల వల్ల అదే కథని నితిన్ తో ‘హార్ట్ ఎటాక్’గా తెరకెక్కించారు పూరి. దానికి ప్రతిఫలంగా ‘లోఫర్’ కథని వరుణ్ కి ఇచ్చేశాడు నితిన్. ఇప్పుడు మరోసారి ఇదే పునరావృతం అవుతోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సారి దర్శకుడు పూరి కాదు.

నితిన్ హీరోగా వచ్చిన ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ సినిమాతో మెగాఫోన్ పట్టిన విజయ్ కుమార్ కొండా వరుణ్ కి ఈ మధ్య ఓ కథ వినిపించారట. దానికి ఈ మెగా హీరో ఓకే చెప్పాడట. ప్రస్తుతం ఫిదా, మిస్టర్ సినిమాలతో బిజీ గా ఉన్న వరుణ్ ఈ సినిమాని డిసెంబర్ లేదా జనవరి నుండి సెట్స్ మీదికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే ‘అఆ’ తర్వాత విజయ్ కుమార్ తోనే నితిన్ మరో సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. కాగా నితిన్ హను రాఘవపూడికి ఓటేశాడు. అందువల్ల విజయ్ పూరిని అనుసరించాడా అన్న అనుమానం తలెత్తుతోంది. అసలు విషయం ఏమిటన్నది వారికే తెలియాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus