వెంకటేశ్, నిత్య మీనన్ కలయికలో సినిమా

వెంకటేశ్, నిత్య మీనన్ కలయికలో ఓ సినిమా రానుంది. వెంకీ వయసు యాభై ఆయిదేళ్ళు. నిత్యకేమో ఇరవై ఎనిమిదే. వయసులో చాలా వ్యత్యాసం ఉందనిపిస్తుంది కదూ. మన సినిమాల్లో ఇది మామూలే మరి. ముఖ్యంగా సీనియర్ హీరోల విషయంలో. అయితే వెంకీ, నిత్యల జోడీ మాత్రం ఇందుకు కాస్త భిన్నం. దానికి కారణం కిశోర్ తిరుమల సిద్ధం చేసిన కథ కథనాలే.

‘నేను శైలజ’ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు కిశోర్ తిరుమల వెంకటేశ్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వయసులో తేడా ఉన్న ఓ జంట మధ్య సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. “ఆడాళ్ళు మీకు జోహార్లు” పేరుతో రానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్న నిత్య మీనన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఆద్యంతం హాస్యంతో సాగే కథలో మంచి భావోద్వేగాలు నింపారని దర్శకుడిని గురించి నిత్య చెప్పుకొచ్చింది. పీఆర్ సినిమాస్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా మల్టీ డైమన్షన్ సమర్పణలో విడుదల కానుంది. వెంకీ ప్రస్తుతం చేస్తున్న ‘సాలా ఖాడూస్’ రీమేక్ పూర్తవగానే నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus