క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానిని కలిసిన వెంకీ..!

  • March 9, 2019 / 07:29 PM IST

‘బాబు బంగారం’ ఇది విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం. ఈ టైటిల్ కి విక్టరీ వెంకటేష్ న్యాయం చేసాడు. అదేంటి మారుతీ డైరక్షన్లో వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు కదా..! మరి ఎలా న్యాయం చేసాడు అని అనుకుంటున్నారా. ఇటీవల విక్టరీ వెంకటేష్ ‘బోన్ క్యాన్సర్’ తో బాధపడుతున్న ఓ అభిమానిని ప్రత్యేకంగా కలిసి అతనితో కొంత సమయం గడిపి.. అతడికి మానసికంగా ధైర్యాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ అభిమానే తెలియజేసాడు. ఆ అభిమాని తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… ” నా అనారోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే వెంకటేష్ గారు స్వయంగా మా ఇంటికి వచ్చారు, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకుని… ఆయన విలువైన సమ్యయాన్ని నాకోసం కేటాయించారు. ఆయన చెప్పిన మాటలు నాకు చాల ధైర్యాన్ని,శక్తిని ఇచ్చాయి. నా జీవితంలో ఈ రోజుని మరిచిపోలేను. వెంకటేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను”… అంటూ ఆ అభిమాని తెలిపాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఈ విషయం పై వెంకటేష్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘వెంకీ మామ’ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. బాబీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా… హీరోయిన్లుగా నటిస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ రైస్ మిల్లు ఓనర్ గా నటిస్తుండగా నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కాబోతుందని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus