Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

‘మా హీరో గురించి జరగని విషయాలను జరిగినట్లుగా కామెంట్లు చేస్తే.. ఊరుకునేది లేదు’.. ఇదీ ఓ హీరో టీమ్‌ జారీ చేసిన నోటీసులు. అవును టాలీవుడ్‌లో ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. కానీ రూమర్లకు, ట్రోలర్లకు చెక్‌ పెట్టడానికి ఓ హీరో టీమ్‌ ఇప్పుడు ఇంత పని చేసింది. దీంతో నెక్స్ట్‌ ఏమవుతుంది అనే చర్చ మొదలైంది. ఇలా చేసిన టీమ్‌ ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు ట్రోలింగ్‌ చేసే అవకాశం ఉన్న ఎలిమెంట్‌ని బ్యాక్‌పాకెట్‌లో తిరిగే హీరో విజయ్‌ దేవరకొండకి చెందిన టీమ్‌.

Vijay Devarakonda

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ సోషల్‌ మీడియాలో ఓ వార్త చర్కర్లు కొడుతోంది. అది విజయ్‌ దేవరకొండకు సంబందించిన ఓ వార్త. ‘రణబాలి’ సినిమా సెట్స్‌లో 5 కారవాన్లు పెడుతున్నారని, అసిస్టెంట్లు ఎక్కువ మంది ఉండాలని హీరో డిమాండ్‌ చేస్తున్నారని వార్తలొచ్చాయి. ట్రోలింగ్‌నే ఆహారంగా పెట్టుకుని జీవిస్తున్న మన సినిమా పరాన్నభుక్తులు (ట్రోలర్లు) ఆ వార్తను పట్టుకుని వైరల్‌ చేశాయి. తాజాగా ఈ విషయం మీదే విజయ్‌ టీమ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

అంతే కాదు ఆ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ రవి శంకర్‌ యర్నేని స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు. షూటింగ్‌ సమయంలో అలాంటివేవీ జరగలేదని స్పష్టం చేశారు. విజయ్‌ ఎప్పుడూ తన పనిపై అంకితభావంతో ఉంటాడని కూడా చెప్పారు. మరిప్పుడు నిర్మాత క్లారిటీ, టీమ్‌ వార్నింగ్‌తోనైనా విజయ్‌ మీద పుకార్లు ఆగుతాయేమో చూడాలి. ‘లైగర్‌’ సినిమా ప్రచారంలో విజయ్‌ చేసి కొన్ని పనులు అతన్ని ట్రోలర్లు దగ్గర చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా కొన్ని ఇలాంటి పనులే చేశాడాయన. ఇప్పుడు కాస్త కామ్‌గా ఉన్నాడనుకోండి.

ఇక ‘రణబాలి’ సినిమా విషయానికొస్తే.. విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన ప్రధాన పాత్రల్లో రాహుల్‌ సాంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 1854 – 1878 మధ్య బ్రిటిష్‌ పాలన కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇది. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబరు 11న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది.

ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus