Anasuya: అనసూయ ఫైర్ అవుతున్న విజయ్ దేవర కొండ ఫ్యాన్స్.!

  • May 8, 2023 / 11:37 AM IST

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా కొన్నిసార్లు అనసూయ చేసే కామెంట్స్ సంచలనాలకు కారణమవుతుంటాయి. ఈసారి ఎదో ట్వీట్ పెట్టింది, దాని మీద నెటిజన్స్ అందరూ ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తున్నారు.

ఇంతకీ అనసూయ ఏమి ట్వీట్ చేసింది, అందులో ఎవరిని ఉద్దేశించి ఆలా పెట్టింది క్లియర్ గా రాయలేదు, కానీ దానికి విజయ్ దేవరుకొండ అభిమానులు మాత్రమే ఎక్కువ ప్రతిస్పందిస్తున్నారు. ఇలా వాళ్ళు కూడా ఎదో పెడుతుంటే, దానికి అనసూయ కూడా మళ్ళీ రిప్లై ఇవ్వడం, ఇలా సాంఘీక మాధ్యమం లో పెద్ద గొడవే జరుగుతోంది. ఇంతకీ అనసూయ ఏమి ట్వీట్ చేసిందో చూద్దాం. “ఇప్పుడే ఒకటి చూసాను.. “ది’ నా బాబోయ్.. పైత్యం.. ఏంచేస్తాం… అంటకుండా చూసుకుందాం” అని పెట్టింది.

దీనికి విజయ్ దేవరకొండ అభిమానులు అందరూ రియాక్ట్ అవుతూ వున్నారు, అనసూయ మీద కొంచెం బాడ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళు మొదటి ట్వీట్ కి ట్రోల్ చేస్తూ ఉంటే కొన్ని గంటల తరువాత ఇంకో ట్వీట్ చేసింది. భలే రియాక్ట్ అవుతున్నార్రా దొంగ… ఊప్స్ .. బంగారుకొండలంట…

ఎక్కడో అక్కడ నేను నిజం అనేది ప్రూవ్ చేస్తూనే ఉన్నందుకు థాంక్స్ రా అబ్బాయిలు” అని పెట్టింది. ఇందులో ‘బంగారు కొండలంట’ అనే పడ్డం ఎవరిని ఉద్దేశించి అని ఉంటుందో అందరూ ఊహించే వుంటారు. ఇలా అంతంతో ఇది మరికొంచెం కాంట్రవర్సీ అయింది. . మరి ఈ ట్వీట్ ఎన్ని పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus