‘గీత గోవిందం’ పైరసీ కావడంపై అసహనం వ్యక్తం చేసిన విజయ్

  • August 13, 2018 / 08:16 AM IST

పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “గీత గోవిందం” ఫస్ట్ లుక్ నుంచి మంచి స్పందన అందుకుంటోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్ తో పాటు సాంగ్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న (ఆదివారం) వైజాక్ లో నిర్వహించారు. అయితే ఇదివేడుకలా జరగలేదు. అందరి మొహాల్లో బాధాకనిపించింది. కారణం సినిమా పైరసీ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం. ఈ వీడియో లింకులను డిలీట్ చేసే పనిలో బిజీగా ఉండటం వలన నిర్మాత బన్నీ వాసు ప్రీ రిలీజ్‌ వేడుకకి రాలేకపోయారు.

ఈ విషయంపై విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘పైరసీ గురించి ఏం చెప్పాలబ్బా? దానిగురించి చెప్పి కూడా వేస్ట్‌. ప్రేక్షకులకు ఏది రైట్‌? ఏది రాంగ్‌? అనేది తెలుసు. మా టీమ్‌ అంతా ఎంతో కష్టపడి సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందని, వాళ్ల స్పందన కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా జరిగింది. దీన్ని తలచుకుని బాధపడాలని అనుకోవడం లేదు. రెండు రోజుల్లో సినిమా విడులవుతుంది. థియేటర్లు నవ్వులతో నిండుతాయి’’ అని చెప్పారు. రిలీజ్ కి ముందు సినిమా నెట్టింట్లోకి వచ్చినప్పటికీ విజయవంతమైన సినిమాలు అనేకం ఉన్నాయి. అందుకే తమ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని “గీత గోవిందం” టీమ్ నమ్మకంగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus