Allu Arjun: బన్నీ ఫ్యాన్స్ ఆ హోటల్ ను ధ్వంసం చేశారా.. నిజమేంటంటే?

  • June 13, 2024 / 04:21 PM IST

టాలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు (Allu Arjun)  ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. పుష్ప ది రూల్ (Pushpa 2) రిలీజ్ డేట్ మారుతుందని సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆగష్టు 15వ తేదీన పుష్ప2 కచ్చితంగా విడుదలవుతుందని ఇందులో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని తెలుస్తోంది. బన్నీ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జులై మూడవ వారం సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా పుష్ప ది రూల్ అదరగొట్టగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. మరోవైపు బన్నీ అభిమానులు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ పై దాడి చేశారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో కిర్రాక్ ఆర్పీ బన్నీని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్లు చేసిన నేపథ్యంలో ఈ వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని సమాచారం అందుతోంది. గతంలో అబిడ్స్ లోని ఒక హోటల్ లో సిబ్బందికి, కస్టమర్లకు మధ్య గొడవ జరగగా ఆ వీడియోను కొంతమంది వైరల్ చేస్తున్నారు.

కొంతమంది కావాలని బన్నీ ఫ్యాన్స్ ను టార్గెటూ చేస్తూ ఈ తరహా వార్తలు ప్రచారం చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయితేజ్ (Sai Tej) బన్నీని అన్ ఫాలో కావడం ఇప్పటికే హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీతో మనస్పర్ధల గురించి బన్నీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus