Virata Parvam: విరాట పర్వం.. టార్గెట్ ఫిక్స్ అయ్యింది

  • May 15, 2021 / 11:10 AM IST

టాలీవుడ్ లో ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో విరాటపర్వం ఒకటి. సాయి పల్లవి, రానా దగ్గుబాటి లాంటి టాలెంటెడ్ నటీనటులు జోడిగా నటించిన సినిమా కావడంతో మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక మరొక టాలెంటెడ్ నటీమణి ప్రియమణి కూడా నక్సలైట్ గా ఫస్ట్ లుక్కుతోనే షాక్ ఇచ్చింది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా టీజర్ కు కూడా మంచి స్పందన దక్కింది.

నిజ జీవితంలోని కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమా కథను రాసుకున్నారట. ఈ సినిమాను వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాపై నటీనటులు టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా సినిమా ఒక వండర్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఒక టార్గెట్ తో రెడీ అవుతోందట. సినిమా థియేటర్లు తెరచుకున్న మరుక్షణమే పరిస్థితులను బట్టి విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఇప్పటివరకైతే సినిమాను ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల చేయడానికి ఎలాంటి డీల్ సెట్టవ్వలేదట. ఆఫర్స్ బాగానే వస్తున్నప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం సినిమాను బిగ్ స్క్రీన్ పైనే విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus