ప్లాప్ డైరెక్టర్.. మల్టీస్టారర్ సినిమా!

  • October 14, 2020 / 06:32 PM IST

ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలుగా నటిస్తూనే.. వేరే సినిమాల్లో విలన్ గా ఛాన్స్ వస్తే నటించడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ సేతుపతికి హీరోగా ఎంత క్రేజ్ ఉన్నా.. విజయ్ ‘మాస్టర్’, ‘ఉప్పెన’ లాంటి సినిమాల్లో విలన్ గా కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. తమిళంలో హీరోగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ‘వరుడు’ సినిమాలో విలన్ గా నటించాడు ఆర్య. ఇప్పుడు మరోసారి అతడు విలన్ పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వినోద్ కుమార్ ఓ సినిమాను నిర్మించబోతున్నారు.

ఇందులో హీరోగా విశాల్ నటిస్తుండగా.. అతడితో తలపడే విలన్ గా ఆర్య కనిపిస్తారట. సినిమాలో ఆర్య పాత్ర హీరో రేంజ్ కి ఎంతమాత్రం తగ్గకుండా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. గతంలో విశాల్-ఆర్య కలిసి ‘వాడు వీడు’ అనే సినిమాలో నటించాడు. మళ్లీ ఇంతకాలానికి వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారు. దర్శకుడు ఆనంద్ శంకర్ తెలుగు, తమిళ భాషల్లో విజయ్ దేవరకొండ హీరోగా ‘నోటా’ అనే సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమా ఆడకపోవడంతో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో నిశ్చితార్ధం చేసుకొని.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు విశాల్-ఆర్య కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నాడు. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ‘గడ్డలకొండ గణేష్’ ఫేమ్ మృణాళిని హీరోయిన్ గా కనిపించనుంది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus