మహేష్, రాజమౌళి లలకు థాంక్స్ చెప్పిన వివి వినాయక్

  • January 19, 2017 / 08:25 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ సూపర్ హిట్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాస్ డైరక్టర్ వివి వినాయక్ ఉద్వేగంతో మాట్లాడారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించిన చిరు 150 వ చిత్రం జనవరి 11 న విడుదలై కలక్షన్ల సునామీ సృష్టించింది. తొలి వారానికి 108. 48 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ ఆనందాన్ని మీడియా మిత్రులతో వినాయక్ పంచుకున్నారు. ” నా దర్శకత్వంలో వచ్చిన అఖిల్ మూవీ ఫైల్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లాను. ‘ఖైదీ నెం 150’ చిత్రం తో పూర్వ వైభవాన్ని తెచుకున్నందుకు ఆనందంగా ఉంది” అని వెల్లడించారు.

సినిమాని ఇంతటి హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. అలాగే “ఖైదీ నెం 150 ”  చిత్రం చూసి సినిమా చాలా బాగుందని, బాస్ చిరంజీవికి ఇదే సరైన రీ ఎంట్రీ అని ఎస్.ఎస్.రాజమౌళి, మహేష్ బాబు అభినందిస్తూ ట్వీట్ చేయడం తనకి ప్రోత్సాహాన్ని అందించిందని వివరించారు. వారిద్దరితో పాటు ఖైదీ మూవీపై స్పందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus