బాలీవుడ్ భామ ఫిక్స్ వరీనా హుస్సేన్ ఫిక్స్ అయ్యిందోచ్..!

  • January 30, 2021 / 05:31 PM IST

ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈసినిమాకి హీరోయిన్ గా వరీనా హుస్సేన్ ఫిక్స్ అయినట్లుగా బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడేస్తున్నాయి. బాలీవుడ్ నుంచి తారక్ కోసం ఈ ముద్దుగుమ్మని త్రివిక్రమ్ సెలక్ట్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. తారక్ తో కలిసి అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు మరో పొలిటికల్ డ్రామాని తారక్ పై ప్లాన్ చేశాడు.

దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని ప్రిపేర్ చేసి జూనియర్ డేట్స్ కోసమే వెయిట్ చేస్తోంది చిత్రయూనిట్. ఎన్టీఆర్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్దే, రష్మిక మందన పేర్లు గట్టిగా వినిపించాయి. కానీ, అనూహ్యంగా ఇప్పుడు త్రివిక్రమ్ బాలీవుడ్ నుంచి ఈ బ్యూటీని తెలుగు తెరపై ఇంట్రడ్యూస్ చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం తెలుస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతోంది.

ఈ క్రమంలో లవ్ యాత్రి అనే సినిమాలో నటించి మెప్పించిన వరీనా హుస్సేన్ ని ఈ సినిమాకోసం ఎంపిక చేశారు. మరి సెకండ్ హీరోయిన్ గా ఈ భామ నటిస్తోందా.. లేదా మెయిన్ హీరోయిన్ గా చేస్తుందా అనేది తెలియాలి. అదీ మేటర్.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus