బాహుబలి బిగినింగ్ కి చాలా కష్టపడ్డామన్న రాజమౌళి

తెలుగు చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. ఈ చిత్రం రూపుదిద్దుకోవడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంత కష్టపడ్డారో.. వారికి అంత పేరు తెచ్చి పెట్టింది. ప్రభాస్, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క, రానా, సత్యరాజ్ తదితర నటులకు ఇది గ్రేట్ బ్రేక్ ని ఇచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి ని సైతం ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు ఆ డైరక్టర్ బాహుబలి కంక్లూజన్ కోసం శ్రమిస్తున్నారు. “బాహుబలి మొదటి పార్ట్ తో పోలిస్తే బాహుబలి 2 కోసం తక్కువగానే కష్టపడ్డాం”  అని రాజమౌళి చెప్పారు.మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో ఎక్కువగా యుద్ధ సన్నివేశాలు ఉంటాయని, ఇందుకోసం ప్రభాస్, రానా చాలా కష్టపడ్డారని అందరూ అంటుంటే జక్కన్న ఏంటి ఇంత సింపుల్ గా చెప్పేశారని అనుమానం రాక మానదు.

అదే విషయాన్నీ దర్శకధీరుడిని అడిగితే ఇలా చెప్పుకొచ్చారు. “బాహుబలి బిగింగ్ చిత్రీకరణ సమయంలో కథపై మాకు చాలా నమ్మకం ఉన్నింది. అయితే దీనిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అనే భయం మాత్రం వెంటాడేది. ఆ భయం సినిమా రిలీజ్ అయిన తర్వాత పోయింది. ఇప్పుడు బాహుబలి లోని ప్రతి క్యారక్టర్ గురించి, కథ అందరికీ తెలుసు. కాబట్టి మాకు సెకండ్ పార్ట్ తీయడం సులభం అయింది. పోరాట సన్నివేశాల కోసం మాత్రం బాగా కష్టపడ్డాం” అని వివరించారు. భారీ అంచనాలతో బాహుబలి 2 వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Baahubali 2 Teaser || Prabhas, Rana, SS Rajamouli || Fan Made - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus