Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

ఒకే పేరుతో రెండు సినిమాలు తెరకెక్కడం చాలా అరుదు. ఒకే ఇండస్ట్రీలో ఇలాంటివి కష్టం. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినా టైటిల్‌ గొడవలు పడి ఎవరో ఒకరు మారుస్తారు. అయితే రెండు వేర్వేరు ఇండస్ట్రీల్లో ఈ పరిస్థితి వస్తే.. ఇప్పుడు బాలీవుడ్‌, మాలీవుడ్‌లో ఇదే పరిస్థితి వచ్చింది. ‘దృశ్యం’ సిరీస్‌లో భాగంగా మూడో సినిమా ఇటు మాలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌లో తెరకెక్కుతోంది. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏది ముందు వస్తుంది, ఏ కథ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Drishyam 3

తెలుగు వారికి ‘దృశ్యం’ (Drushyam) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రెండు సినిమాలు వచ్చాయి ఈ సిరీస్‌లో. మూడో సినిమాను వెంకటేశ్‌ ఎప్పుడు చేస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే రెండు వేర్వేరు కథలతో ‘దృశ్యం 3’ తెరకెక్కుతోంది. ‘దృశ్యం 3’ గురించి ఇప్పటికే మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌  (Jeethu Joseph) ‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. దృశ్యం 3 రాబోతోంది’ అని ప్రకటించేశారు.

తాజాగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) కూడా ఇలాంటి ప్రకటన చేశారు. అయితే కొత్త కథ అని చెప్పేశారు. దీంతో ఎవరు ముందుగా సినిమాను పట్టాలెక్కిస్తారు? ఎవరు ముందుగా రిలీజ్‌ చేస్తారు అని సమాచారం. ఓనమ్‌ పండుగ తర్వాత ‘దృశ్యం 3’ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘లైట్స్‌.. కెమెరా.. అక్టోబరు’ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది.

అక్టోబరు 2 తర్వాత షూటింగ్‌ ప్రారంభించే దిశగా అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) పనులు మొదలు పెట్టారట. ‘దృశ్యం3’ అవుట్‌ డోర్‌ షూటింగ్‌ కోసం అజయ్‌ దేవగణ్‌ మూడు నెలలు కాల్‌షీట్స్‌ ఇచ్చాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే, అక్టోబరు 2, 2026న  సినిమాను విడుదల చేయాలని అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) టీమ్‌ భావిస్తోంట. అయితే మోహన్‌ లాల్‌ ఇంకాస్త ముందుగానే తీసుకురావాలని అనుకుంటున్నారట. 2026 ఆగస్టు మూడో వారంలో సినిమాను థియేటర్లలోకి తెచ్చే అవకాశం ఉందని సమాచారం

నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus