బిగ్ బాస్ 4: గ్రాండ్ ఫినాలేకి వచ్చేది వాళ్లేనా..!

  • December 4, 2020 / 05:09 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 తుది సమరానికి చేరుకుంది. మరో ఒక్కవారమే మిగిలి ఉంది. ఈవారం ఒకరు ఎలిమినేట్ అయితే, వచ్చేవారం ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు. దీంతో టాప్ – 5 పార్టిసిపెంట్స్ మాత్రమే మిగులుతారు. వీరితోనే గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. గత మూడు సీజన్స్ లో మనం చూసింది ఇదే. సీజన్ – 1కి తారక్ సింగిల్ హ్యాండ్ తో షోని నడిపించాడు. అప్పుడు పూణెలో సెట్ వర్క్ వేశారు కాబట్టి సెలబ్రిటీలని తీసుకుని రావడం కష్టం అయ్యింది. అయితే, ఇప్పుడు హైదారాబాద్ లో కాబట్టి ఈసారి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారా అనేది సోషల్ మీడియాలో ఆసక్తిని రేపుతోంది. అంతేకాదు, బిగ్ బాస్ లవర్స్ ఈసారి గెస్ట్ గా ఎవరు వస్తారా అని చూస్తున్నారు. ఎందుకంటే, లాస్ట్ సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి వచ్చి హౌస్ మేట్స్ గురించి చాలా విషయాలు చెప్పాడు. మెగా ఫైనల్స్ లో దుమ్మురేపాడు. అంతేకాదు, సీజన్ – 3 లో గెస్ట్ హోస్టింగ్ చేసిన రమ్యకృష్ణ కూడా షో కి మంచి రేటింగ్ తీస్కుని వచ్చింది. అంతకుముందు సీజన్ 2 లో చూసినట్లయితే విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా వచ్చి అలరించాడు.

ఇప్పుడు సీజన్ 4 లో గెస్ట్ హోస్టింగ్ గా వచ్చిన సమంత ఇరగదీసిందనే చెప్పాలి. అంతేకాదు, హీరో అఖిల్ కూడా వచ్చి సమంతకి సపోర్టింగ్ గా నిలిచాడు. మరి ఇప్పుడు ఈసీజన్ లో చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అనేది లెక్కలు వేస్తున్నారు. నిజానికి అయితే విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా చాలామందిని ట్రై చేసిందట బిగ్ బాస్ టీమ్. కానీ ప్రస్తుతం ఉన్న షూటింగ్ పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్లు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.

డిసెంబర్ 20వ తేదిన జరగబోయే ఈ ఫినాలేకి నాగచైతన్యని తీస్కుని వచ్చే ఆలోచనలో ఉన్నాడట నాగార్జున. అంతేకాదు, నాగార్జున తో పాటుగా హైబ్రిడ్ పిల్ల అయిన సాయిపల్లవి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వీరిద్దరూ కాసేపు అలరించిన తర్వాత చీఫ్ గెస్ట్ గా హీరోయిన్ అనుష్క వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూద్దాం.. ఎవరు వస్తారు అనేది. అదీ మేటర్.

[yop_poll id=”1″]
Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus