మెగా హీరో ఆ సినిమాకి నో చెప్పడానికి కారణం ఇదే

  • June 3, 2018 / 07:51 AM IST

డైరక్టర్ చంద్రశేఖర్ యేలేటి.. మైత్రి మూవీ మేకర్స్ వారు విభిన్నమైన అభిరుచి కలిగిన వారు. వినూత్న కథలతో ఐతే, అనుకోకుండా ఒకరోజు, మనమంతా… వంటి సినిమాలను చంద్రశేఖర్ తెరకెక్కించారు. ఇక శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి పక్కా కమర్షియల్ సినిమాలను నిర్మించడం మైత్రి మూవీ మేకర్స్ స్టైల్. అయితే వీరిద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఈ ప్రాజక్ట్ పై అందరికన్ను పడింది. ఇందులో ఎవరు హీరోగా నటిస్తారా? అని ఎదురుచూసారు. ఈ కథ మెగా హీరో సాయిధరమ్ తేజ్ వద్దకు వెళ్ళింది. అసలే వరుస అపజయాలతో సతమతమవుతున్న తేజు ఈ సినిమాకి ఒకే చెప్పేస్తారని అందరూ అనుకున్నారు. తీరా కథ విన్న తర్వాత నో చెప్పారంట.

మరి ఎందుకు ఇంత మంచి ఆఫర్ ని వదులుకున్నారని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. చంద్రశేఖర్ యేలేటి గత చిత్రాల మాదిరిగానే ఇందులోనూ కథే హీరో అని తెలిసింది. హీరోయిజం చూపించడానికి అసలు స్కోప్ లేకపోవడంతో ఈ ప్రాజక్ట్ ని పక్కన పెట్టారని టాక్. ఈ కారణంతోనే గోపిచంద్ కూడా ఈ చిత్రానికి సైన్ చేయలేదు. అయితే నితిన్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. నితిన్ కెరీర్ కి త్రివిక్రమ్ తో చేసిన అ..ఆ మూవీ మంచి ప్లస్ అయింది. అందులో హీరోకంటే హీరోయిన్ డామినేషన్ కనిపిస్తుంది. అయినా ఒప్పుకొని విజయం అందుకున్నారు. సో ఇప్పుడు కూడా కథాబలమున్న మూవీతో హిట్ కొట్టబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus