సాయి పల్లవి కి ఆ అనుమానం ఎందుకు వచ్చింది!

  • November 3, 2018 / 11:44 AM IST

మలయాళం లో సూపర్ హిట్ సాధించిన ప్రేమమ్ సినిమాతో తో సినీ కెరియర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఫిదా సినిమాతో ప్రేక్షకులని ఫిదా చేసింది. ఈ సినిమా తరువాత సాయి పల్లవికి వరుస ఆఫర్లు అనేవి వచ్చాయి. తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న ఈ భామ కి ఏదో అనుమానం వచ్చిందంటా.

ఇక విషయంలోకి వెళితే, డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక కథని సాయి పల్లవికి వినిపించి యాక్ట్ చేయమని కోరగా అందుకు సాయి పల్లవి నో అని చెప్పేసిందంట. అయితే మల్టీ స్టారర్ గా తెరకెక్కతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ తప్పనిసరిగా ఉంటారని, ఇద్దరు హీరోయిన్స్ ఉండటం వలన తన పాత్రకి ఎక్కడ ప్రాధాన్యత తగ్గిపోతుందో అనే అనుమానంతోనే హరీష్ శంకర్ సినిమాకి నో చెప్పేసిందని అంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ మిస్ చేసుకున్న ఆ అవకాశం ఎవరికీ వరిస్తుందో అని తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus