రెండు వారాల గ్యాప్ లో రిలీజ్ కానున్న ఎన్టీఆర్ బయోపిక్!

  • October 4, 2018 / 11:48 AM IST

నటసింహ బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన తొలి మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి అద్భుత విజయాన్ని సాధించింది. ఆ కాంబోలో వస్తున్న రెండో మూవీ “ఎన్టీఆర్” బయోపిక్.  ఖర్చుకు వెనుకాడకుండా భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అటు సినిమారంగంలోను, ఇటు రాజకీయరంగంలోనూ విజయకేతనం ఎగురవేశారు. అందుకే అతని బయోపిక్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. మొదటి పార్ట్ లో సినిమా లైఫ్ ని చూపించబోతున్నారు. ఇందుకు ‘కథానాయకుడు’ అనే అటైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ జనవరి 9 న రిలీజ్ కానుంది.

ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని రెండో భాగంలో చూపించనున్నారు. ఇందుకు మహానాయకుడు అనే అటైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా జనవరి 24 న థియేటర్లోకి రానుంది. ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్ రెండు వారాలే ఉండడం విశేషం. ఈ విషయాన్ని నేడు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ న్యూస్ ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మహానటుడు భార్య బసవతారకమ్మ పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. రానా, సుమంత్.. వంటి ఎంతోమంది స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలు కొత్తరికార్డులు నెలకొల్పడం గ్యారంటీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus