బ్రేక్ ఈవెన్ కు ఎంత రాబట్టాలంటే..?

  • November 7, 2019 / 04:49 PM IST

‘చరిత సినిమా ఆర్ట్స్’ బ్యానర్ పై జి.వి.ఎన్ శేఖర్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం ‘ఏడు చేపల కథ’. ఎస్.జె.చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అభిషేక్, భాను శ్రీ హీరో హీరోయిన్లు గా నటించారు. పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం ఈరోజు(నవంబర్ 7న) విడుదలయ్యింది. టీజర్, ట్రైలర్ లకు ఓ రేంజ్ ప్రమోషన్లు చేసి విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు.. రిలీజ్ కు మాత్రం ఎటువంటి ప్రమోషన్ లేకుండా విడుదల చేసేసారు. ఇక ఈ చిత్రానికి మొదటి షో నుండే హౌస్ ఫుల్ బోర్డులు పడుతుండడం విశేషం.

అయితే ఈ చిత్రానికి బిజినెస్ ఎంత జరిగి ఉండొచ్చు.. లాభాల్లోకి రావాలంటే ఎంత రాబట్టాలి అనే విషయం ప్రస్తుతం చర్చ మొదలవుతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 1.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 1.5 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మాస్ సెంటర్స్ లో ఈ చిత్రానికి బుకింగ్స్ చాలా బాగా అవుతున్నాయనే చెప్పాలి. పూర్తిగా ‘ఎ’ రేటింగ్ సినిమా కాబట్టి 18 సంవత్సరాలు లోపు వారిని థియేటర్లలోకి రానివ్వడం లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ అని చెప్పాలి.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus