పాలిటిక్స్లో బిజీ అవుతున్న కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్కి ఏదీ కలిసిరావడం లేదు. ఓ పక్క కరూర్ కేసు, విడాకుల రూమర్స్తో పర్సనల్ లైఫ్ టెన్షన్స్లో ఉంటే, మరోపక్క తన లాస్ట్ మూవీ ‘జన నాయగన్’ (Jana Nayagan) మేకర్స్కు చుక్కలు చూపిస్తోంది.
తాజాగా ఈ సినిమా భారీ ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయ్యిందనే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.విజయ్ లాస్ట్ సినిమా కావడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.120 కోట్లకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిందట. కానీ, హెచ్. వినోథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పొలిటికల్ టచ్ ఉండటంతో సెన్సార్ బోర్డ్ (CBFC) బ్రేకులు వేసింది. దీంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం సినిమాను టైమ్కి ఇవ్వలేకపోవడంతో ప్రైమ్ సంస్థ ఈ డీల్ నుంచి తప్పుకున్నట్లు బజ్ నడుస్తోంది.
దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇది కోలుకోలేని ఆర్థిక దెబ్బే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఈ సినిమా ఒక బలమైన పునాదిగా మారుతుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో సెన్సార్ వివాదాలు, డీల్ రద్దు వార్తలు కలకలం రేపుతున్నాయి.
ఈ అడ్డంకులన్నీ దాటుకుని డైరెక్టర్ వినోథ్ ఈ చిత్రాన్ని థియేటర్లలోకి ఎప్పుడు తీసుకువస్తారో అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ముందు సెన్సార్ ఇష్యూస్ క్లియర్ చేసి, రిలీజ్ డేట్ ప్రకటిస్తే తప్ప ఫ్యాన్స్లో ఉన్న గందరగోళానికి తెరపడదు. మరి ఈ డీల్ రద్దు వార్తలపై అమెజాన్ లేదా మూవీ టీమ్ అధికారికంగా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.