26 రోజుల్లో 26 కోట్ల షేర్ రాబట్టిన మహానటి

  • June 6, 2018 / 10:30 AM IST

అభినేత్రి సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి మే 9న రిలీజ్ అయి అందరి మనసులను గెలుచుకుంది. సావిత్రిగా కీర్తి సురేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ మెప్పించారు. హీరో హీరోయిన్స్ మాత్రమే కాకుండా సినిమాలో నటించిన మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, సమంత, విజయ్ దేవరకొండ, క్రిష్, అవసరాల శ్రీనివాస్ వీరందరూ సినిమా విజయంలో తమవంతు పాత్ర పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ స్వరపరిచిన పాటలు ప్రాణం పోశాయి.

అన్ని చక్కగా కుదరడం, ఆ తర్వాత పెద్ద చిత్రం ఏదీ రిలీజ్ కాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ కలక్షన్స్ సాధించాయి. ఈనెల నాలుగో తేదీ నాటికీ ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల షేర్ సాధించింది. అంటే 26 రోజుల్లో 26 కోట్ల షేర్ రాబట్టిందన్నమాట. సరాసరిన రోజుకో కోటి చొప్పున మహానటి వసూలు చేసింది. సినిమా ఊహించినదానికంటే ఘనవిజయం సాధించడంతో శాటిలైట్స్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయింది. స్టార్ మా ఛానల్ వాళ్ళు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని 15 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. డిజిటల్ రైట్స్ కూడా బాగానే ధర పలికింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus