రాంచరణ్ వాళ్ళని వెయిటింగ్ లో పెట్టాడే..!

  • August 1, 2020 / 05:40 PM IST

‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత చరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేసేదీ ఇంకా క్లారిటీ రాలేదు. కొరటాల శివ డైరెక్షన్లో చరణ్ సినిమా ఉంటుందని టాక్ వచ్చింది. అయితే అందులో నిజం లేదని నిన్నటితో ప్రూవ్ అయ్యింది. కొరటాల శివ తన తదుపరి సినిమాని అల్లు అర్జున్ తో చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ‘ఆచార్య’ పూర్తయిన వెంటనే కొరటాల శివ.. బన్నీతోనే సినిమా చేయనున్నాడు. ఈలోపు బన్నీ.. సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న ‘పుష్ప’ ను ఫినిష్ చేస్తాడని తెలుస్తుంది.

ఇక త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమాతో బిజీ అయిపోతాడు కాబట్టి.. మాటల మాంత్రికుడుతో సినిమా చేసే అవకాశం లేదు. ఈ క్రమంలో చరణ్.. రాజమౌళి తరువాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే విషయం పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు చరణ్ కోసం ముగ్గురు డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు.

అందులో ‘సైరా నరసింహారెడ్డి’ దర్శకుడు సురేందర్ రెడ్డి, అలాగే ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి, ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుముల వంటి వారు వెయిట్ చేస్తున్నారు. వీరిలో చరణ్ ఏ డైరెక్టర్ ను తన నెక్స్ట్ సినిమాకి చూజ్ చేసుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఎక్కువ శాతం సురేందర్ రెడ్డికే ఉన్నట్టు కూడా వార్తలువస్తున్నాయి.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus