‘సాహో’ వల్ల ప్రభాస్ కు 50 కోట్ల నష్టం?

  • September 23, 2019 / 01:31 PM IST

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నుండీ వచ్చిన చిత్రం కాబట్టి ‘సాహో’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలైన మొదటి రోజు నుండే డిజాస్టర్ టాక్ రావడంతో ఈ చిత్రం కనీసం వసూళ్లను అయినా రాబడుతుందా అనే అనుమానం అందరిలోనూ నెలకొంది. కానీ అనూహ్యంగా ఈ చిత్రం 220 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. కానీ థియేట్రికల్ బిజినెస్ మాత్రం 290 కోట్లకు జరగడంతో 70 కోట్ల వరకూ బయ్యర్స్ కు నష్టాలు వచ్చేలా ఉన్నాయి.

ఈ చిత్రానికి ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రేమ్యూనరేషన్ తీసుకోలేదు. కానీ కొందరు బయ్యర్స్ కు 50 కోట్ల వరకూ గ్యారంటీ ఇస్తూ సంతకాలు చేసి ఇచ్చాడట. దీంతో రూపాయి దక్కక పోగా 50 కోట్లు నష్టం వచ్చింది అని తెలుస్తుంది. అయితే నిర్మాతలు ప్రభాస్ ఫ్రెండ్స్ కాబట్టి ఇక డిజిటల్ రైట్స్ రూపంలో 150 కోట్ల వరకూ వచ్చాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదనే చెప్పాలి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus