ప్రతిష్ఠాత్మక జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024లో సెన్సార్ అయిన సినిమాలకు ఈ పురస్కారాలు ప్రకటించారు. ఇందులో తెలుగు సినిమాలకు, తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు దక్కాయి. అవేంటో ఓసారి చూద్దాం.
* ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందిన పాన్ ఇండియా సినిమా ‘కల్కి 2898 ఏడీ’కి హోల్సమ్ ఎంటర్టైనర్ అవార్డు దక్కింది. బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్గా ఈ సినిమాకే నితిన్ జిహాని పురస్కారం దక్కించుకున్నారు.
* నివేదా థామన్ – విశ్వదేవ్ రాచకొండ – అరుణ్దేవ్ కాంబోలో నంద కిశోర్ ఈమని రూపొందించిన ‘35 చిన్న కథ కాదు’ సినిమాకు బాలల చిత్రం పురస్కారం దక్కింది. ఇదే సినిమాకు అరుణ్దేవ్ ఉత్తమ బాల నటుడి అవార్డు కూడా అందుకున్నాడు.
* ఒరిజినల్ స్క్రీన్ప్లే విభాగంలో ‘పుష్ప: ది రూల్’ సినిమాకు గాను బండ్రెడ్డి సుకుమార్కు పురస్కారం లభించింది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో ఇదే సినిమాకు గాను దీపాళి నూర్, శీతల్ శర్మ పురస్కారం దక్కించుకున్నారు.
* ఉత్తమ డైలాగ్ రైటర్గా దుల్కర్ సల్మాన్ – మీనాక్షి చౌందరి నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాకు దర్శక రచయిత వెంకీ అట్లూరి పురస్కారం గెలుచుకున్నారు.
* ఉత్తమ చిత్రం (తెలుగు) పురస్కారం నిహారిక కొణిదెల నిర్మించిన కొత్త కుర్రాళ్ల సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా దక్కించుకుంది. ఇదే సినిమాకు బెస్ట్ మేకప్ విభాగంలో పి.రవికుమార్కి అవార్డు లభించింది.
ఈసారి ఐదు తెలుగు సినిమాలకు పురస్కారాలు లభించినా.. అభిమానులు, తెలుగు సినిమా పరిశీలకులు ఊహించిన, ఆశించిన సినిమాలు, పురస్కారాలు రాకపోవడం గమనార్హం. జాతీయ చలనచిత్ర అవార్డుల రేసులో తెలుగు నుండి ‘పుష్ప: ది రూల్’, ‘కల్కి 2798 AD’ సినిమాలకు పురస్కారలు పక్కా అని అనుకున్నారు. ఈ సినిమాలకు కొన్ని అవార్డులు దక్కినా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, దర్శకత్వం లాంటివి రాకపోవడం నిరాశ కలిగించే అంశమే. అలాగే ‘పుష్ప: ది రూల్’ సినిమాలో నటనకుగాను బన్నీకి మరోసారి జాతీయ అవార్డు వస్తుందని కొందరు ఊహించారు. అది సాధ్యపడలేదు.