Radhe Shyam: వామ్మో.. రాధేశ్యామ్ టైటిల్స్ కోసమే అంత ఖర్చా?

  • August 21, 2021 / 12:33 PM IST

స్టార్ హీరో ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు ఉండటంతో ప్రభాస్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే సాహో సినిమా రిజల్ట్ ప్రభావం ప్రభాస్ తరువాత సినిమాలపై మాత్రం పడలేదు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ గురించి తెలిసి ఆశ్చర్యపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ వంతవుతోంది.

రాధేశ్యామ్ మేకర్స్ సినిమా స్టార్టింగ్, ఎండింగ్ టైటిల్స్ కోసం ఏకంగా 30 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం గండికోట సమీపంలో సెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని టైటిల్ కార్డ్స్ విజువల్ కోసం ఈ సెట్ ను నిర్మించారని సమాచారం. టైటిల్స్ కోసమే నిర్మాతలు ఈ స్థాయిలో ఖర్చు చేస్తుంటే సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు చేశారో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ సినిమా టైటిల్స్ బడ్జెట్ తెలిసిన ఫ్యాన్స్ ప్రభాస్ స్టామినాకు ఇదే నిదర్శనం అని కామెంట్లు పెడుతున్నారు.

మూడు రోజుల పాటు టైటిల్స్ కు సంబంధించిన పనులు జరుగుతాయని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో సందేహాలు అవసరం లేదని తెలుస్తోంది. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus