3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

2009 లో హిందీలో విడుదలై అప్పట్లో కలెక్షన్ల వర్షం కురిపించి సంచలనాత్మకంగా నిలిచిన చిత్రం ‘3 ఇడియట్స్’. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించగా, వినోద్ చోప్రా బ్యానర్ లో విధు వినోద్ చోప్రా ఈ మూవీని నిర్మించాడు. అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటించారు. 2009 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25కి విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావటమే కాకుండా 3 జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది.

3 Idiots

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాంట్లో భాగంగా ఈ మధ్యనే దర్శకుడు ఒక ఆలోచనతో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసినట్టు సినీ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే 3 ఇడియట్స్ మూవీలోని పాత్రలు 15 సంవత్సరాల తరువాత కలుసుకుంటే, ఆ తరువాత జరిగే సంఘటనల గురించి ఇంట్రెస్టింగ్ స్క్రిప్టును సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు దీనికి సంబందించి అధికారికంగా ఏ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ అతి త్వరలోనే ఆఫీసియల్ స్టేట్మెంట్ రానుందట.

దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మొదట్లో ఫిల్మ్ ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి మున్నా భాయ్ ఎంబీబీఎస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో డైరెక్టర్ గా మెగాఫోన్ చేతపట్టి ఆ తరువాత ‘3 ఇడియట్స్’,’ పీకే’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, 11 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.

‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus