Priyanka Mohan: ప్రియాంక అరుళ్ మోహన్.. కి మాత్రమే ఎందుకు ఇలా..?

  • January 4, 2024 / 11:41 AM IST

ప్రియాంక అరుళ్ మోహన్.. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. 2019 లో వచ్చిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఆమె లుక్స్ యూత్ ను ఆకట్టుకోవడంతో శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. కానీ ఆమె బ్యాడ్ లక్ అనుకోవాలి..! ఆ సినిమా కూడా ఆడలేదు. దీంతో కోలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ శివ కార్తికేయన్ సరసన నటించిన ‘డాక్టర్’ ‘డాన్’ సినిమాలు సక్సెస్ సాధించాయి.

అందుకే ఈమెకు టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ లభించింది.’ఓజీ’ సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపికైనట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ ఒక్క ప్రకటన వల్ల .. ఆమెకు టాలీవుడ్ నుండి మరో రెండు సినిమాల్లో ఛాన్సులు లభించాయి. అందులో ఒకటి నాని సరసన ‘సరిపోదా శనివారం’ కాగా, ఇంకోటి రవితేజ – గోపీచంద్ మలినేని సినిమాలో కావడం విశేషంగా చెప్పుకోవాలి. దీంతో టాలీవుడ్లో కూడా ఆమె దశ తిరిగింది అని అంతా అనుకున్నారు.

కానీ కట్ చేస్తే .. రవితేజ – గోపీచంద్ ..ల మూవీ ఆగిపోయింది. ఓవర్ బడ్జెట్ కారణంగా ఆ సినిమాని నిర్మాతలైన ‘మైత్రి’ వారు పక్కన పెట్టారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఆగిపోయింది. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమా షూటింగ్ మాత్రమే జరుగుతుంది. ఈ సక్సెస్ అనేది (Priyanka Mohan) ఆమెకు చాలా ముఖ్యం

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus