వారం ముందుగానే స్పైడర్ ని చూడనున్న కృష్ణ కుటుంబసభ్యులు!

  • September 20, 2017 / 01:43 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ ఎంట్రీ గట్టిగానే ప్లాన్ చేశారు. కమర్షియల్ డైరెక్టర్ మురుగదాస్ తో స్పైడర్ చిత్రాన్ని కంప్లీట్ చేశారు. ఎక్కువ డేట్స్ కేటాయించి మరీ ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమా మేకింగ్ సమయంలో ఎందులోనూ కాంప్రమైజ్ కాలేదు. అలాగే ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. చివరి నిముషంలో హడావుడి పడకుండా ముందుగా సెన్సార్ పూర్తి చేశారు. ఈ సినిమాని మహేష్ తన తండ్రి కృష్ణ, కుటుంబ సభ్యులకు రిలీజ్ కి వారం రోజుల ముందుగానే చూపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్ అన్నయ్య చెన్నై లో సెటిల్ అయ్యారు.

అక్కడి థియేటర్ లో వచ్చే ఆదివారం షో వేయనున్నట్లు సమాచారం. తండ్రి, అన్న, అక్కా చెల్లెల్లు, వారి పిల్లలతో కలిసి మహేష్ కూడా ప్రేక్షకుడిలా స్పైడర్ ని చూసి ఆనందించనున్నారు. అలాగే కోలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షో వేయనున్నారు.  ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27 న థియేటర్లో సందడి చేయనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus