ఈసారైనా నిర్మాతలు మాట నిలబెట్టుకుంటారా?

  • May 20, 2020 / 09:00 AM IST

అసలే ఈ మధ్యన ప్రభాస్ సినిమాలు రెండేళ్ళకు ఒకటి అన్నట్టుగా వస్తున్నాయి. 2013 లో ‘మిర్చి’ విడుదల అయ్యాక.. 2015 లో ‘బాహుబలి’ రిలీజ్ అయ్యింది. అటు తరువాత 2017 లో ‘బాహుబలి2’ రిలీజ్ అయితే.. మళ్ళీ 2019 లో ‘సాహో’ విడుదలయ్యింది. ఇప్పుడు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న తన 20 వ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు అయిన ‘యూవీ క్రియేషన్స్’ వారు సరిగ్గా అప్డేట్స్ కూడా ఇవ్వకుండా ఉండడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

లాక్ డౌన్ ముందు వరకూ ఈ చిత్రం షూటింగ్ జరిగింది. అందులోనూ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఫస్ట్ లుక్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం అని ట్వీట్ కూడా వేసాడు. కానీ నిర్మాతలు రిలీజ్ చెయ్యలేదు. దాంతో అభిమానులు ‘బ్యాన్ యూవీ క్రియేషన్స్’ అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. దాంతో ఇప్పుడు సరైన సమయం కాదు.. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం అని చెప్పుకొచ్చారు. అంతేకాదు సినిమా ప్రారంభంలో తీసిన కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసి అభిమానులను కూల్ చేసే ప్రయత్నాలు చేశారు.

ఇప్పుడు ఫస్ట్ లుక్ ఇవ్వడానికి రెడీ అయినట్టు కూడా తెలుస్తుంది. రంజాన్ కానుకగా మే 24 న విడుదల చేయబోతున్నారు అని తెలుస్తుంది. అలా అయితే బాలీవుడ్ ప్రేక్షకులకి కూడా ఫస్ట్ లుక్ త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.. తద్వారా సినిమా పై క్రేజ్ ఏర్పడుతుంది అని వారి ప్లాన్. మరి ఈ ప్రచారంలో ఎంత వరకూ నిజముందో అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచిచూడాల్సి ఉంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus