A1 Express: సందీప్ కిషన్ సినిమాకి ఐ.ఎం.డి.బి రేటింగ్ కలిసొచ్చేనా..!

  • April 29, 2021 / 06:49 PM IST

సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా డెన్నిస్ జీవన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘వేంకటాద్రి టాకీస్’ బ్యానర్ల పై అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.సందీప్ కిషన్ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. హాకీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 5న విడుదలయ్యింది. ఓపెనింగ్స్ కూడా చాలా బాగా నమోదయ్యాయి.

అయితే ఆ తరువాతి వారం ‘శ్రీకారం’ ‘జాతి రత్నాలు’ వంటి క్రేజీ సినిమాలు విడుదలవడంతో ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ ను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఈ చిత్రాన్ని చాలా థియేటర్ల నుండీ తొలగించారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ ఫలితం తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా.. మే 1 నుంచి ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) వారు ఈ చిత్రానికి మంచి రేటింగ్ ఇచ్చారు.

6.8/10 రేటింగ్ ను ఈ చిత్రం సాధించింది. దాంతో ఈ సినిమాని కచ్చితంగా ఓటిటిలో చూడాలి అని డిసైడ్ అయ్యారు ప్రేక్షకులు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా ఇప్పుడు ఓటిటిల హవా మళ్ళీ ఊపందుకుంది. దాంతో కచ్చితంగా ఈ వీకెండ్ కు ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ మంచి స్టఫ్ అని చెప్పొచ్చు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ కార్తీ ‘సుల్తాన్’ చిత్రాలు కూడా ఓటిటిలో విడుదల కాబోతున్నాయి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus