పవన్, త్రివిక్రమ్ సినిమాలో తన రోల్ బయట పెట్టిన ఆది పినిశెట్టి

  • June 19, 2017 / 07:37 AM IST

జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడో సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పవన్ నటిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా అందాలు ఆరబోయనున్నారు. ఒక ప్రధాన పాత్రలో అలనాటి హీరోయిన్ కుష్బూ నటిస్తోంది. యంగ్ హీరో ఆది పినిశెట్టి కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అతను చేసే రోల్ గురించి స్వయంగా వెల్లడించారు. ఆది పినిశెట్టి హీరోగా చేసిన ‘మరకతమణి’ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

“నాకు విభిన్నమైన రోల్స్ చేయడమంటే ఇష్టం. అందుకనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నాను” అని అన్నారు. రెగ్యులర్ విలన్ రోల్స్ తాను చేయనని, గతంలో ‘సరైనోడు’ సినిమాలో చేసిన వైరం ధనుష్ పాత్ర ఒక ఐడియాలజీతో నడుస్తుందని, అందుకే చేశానని వివరించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా తనది అలాంటి పాత్రేనని, తన క్యారెక్టర్ ఒక ఐడియాలజీ ఉంటుందని, దాని కోసం హీరోతో ఫైట్ చేస్తానని చెప్పారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా  ప్రస్తుతం సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus