అమీర్ ఖాన్ స్థానంలో స్టైలిష్ హీరో
- December 26, 2020 / 03:29 PM ISTByFilmy Focus
బాలీవుడ్ లో ఒక బిగ్గెస్ట్ కాంబినేషన్ జస్ట్ లో మిస్ అయ్యింది. ఎప్పటి నుంచో ఇతర ఇండస్ట్రీలను ఊరిస్తున్న విక్రమ్ వేద రీమేక్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ లో విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన ఆ సినిమా 2017లో బిగెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటి. అయితే ఆ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని గత కొంతకాలంగా అమీర్ ఖాన్ చాలా ప్రయత్నాలు చేశారు.
అయితే ఫైనల్ గా విక్రమ్ వేద బాలీవుడ్ రీమేక్ మరో హీరో చేతుల్లోకి వెళ్లింది. మాధవన్ పాత్రలో అమీర్ ఖాన్ నటిస్తారు అనుకుంటే ఇప్పుడు స్టైలిష్ హీరో హృతిక్ రోషన్ ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరాడు. అసలు అతను ఈ సినిమా చేస్తాడని ఎవరు ఊహించలేదు. ఇక విజయ్ సేతుపతి చేసిన మరో పవర్ఫుల్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ చేసి ఉంటే మరోలా ఉండేదని కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఒరిజినల్ తమిళ్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పుష్కర్- గాయత్రి దంపతులు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే తెలుగులో కూడా సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉన్నట్లు గతంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. బాలకృష్ణ, రాజశేఖర్ నటించబోతున్నారని అలాగే పవన్ కళ్యాణ్ మరో హీరో కూడా చేయవచ్చని టాక్ వచ్చింది. కానీ ఇంతవరకు ఆ విషయంలో ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!














