ఈ ఇద్దరు హీరోలకి ఈవారం చాలా కీలకం కానుంది

  • July 3, 2018 / 09:41 AM IST

ఎప్పుడో 2016లో వచ్చిన “సుప్రీం” తర్వాత సరైన హిట్ లేని సాయిధరమ్ తేజ్, అప్పుడెప్పుడో 2014లో వచ్చిన “లౌక్యం” తర్వాత కనీస స్థాయి విజయాన్ని సైతం అందుకోలేకపోయిన గోపీచంద్ లు ఈవారం ఒకేసారి విజయాన్ని అందుకోవడం కోసం తలపడుతున్నారు. సాయిధరమ్ తేజ్ నటించిన 10వ సినిమా అయినా “తేజ్ ఐ లవ్ యూ”, గోపీచంద్ నటించిన 25వ చిత్రమైన “పంతం” ఒకరోజు తేడాలో ఈ గురువారం, శుక్రవారం విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకులకు పెద్దగా అంచనాల్లేవు. ఈ ఇద్దరు హీరోల మునుపటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టి ఉండడమే కాక ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షించి ఉండడం, వారి తాజా చిత్రాల ట్రైలర్స్ ప్రేక్షకుల్ని పెద్దగా ఎగ్జైట్ చేయకపోవడం ఇందుకు ముఖ్యకారణం.

కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన “తేజ్ ఐ లవ్ యూ” క్యూట్ లవ్ స్టోరీ కాగా.. “జై లవకుశ” చిత్రానికి రైటర్ గా వర్క్ చేసిన చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన “పంతం” కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ రెండు సినిమాలు విజయం సాధించడం గోపీచంద్=సాయిధరమ్ తేజ్ లకు చాలా కీలకం. అందుకే ఇద్దరూ తమ సినిమాల్ని విశేషమైన రీతిలో ఎన్నడూలేని విధంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రాల విజయాలు వాళ్ళ కెరీర్ లకు మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కూ కీలకంగా మారనున్నాయి. మరి ఆ సినిమా రిజల్ట్ ఏమిటనేది ఇంకో రెండ్రోజుల్లో తేలిపోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus