Nandu: నందు సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు.. అలా చేయడంతో?

  • February 14, 2024 / 02:45 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నందు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. నందును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం నందు ఢీ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా నందు చేసిన మంచి పని సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. 800 మంది ఆకలి తీర్చి నందు మంచి మనస్సును చాటుకున్నారు. త్వరలో మరోసారి తండ్రి కాబోతున్న నందు శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేసి 800 మందికి ఆహారాన్ని అందించారు.

సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసి ఆ ఆహారాన్ని వడ్డించి ఆ తర్వాత పాత్రలు కూడా కడగగడం ద్వారా నందు సింప్లిసిటీని చాటుకున్నారు. ఈ జనరేషన్ లో నందు అంత మంచి మనస్సు ఉన్న వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. 2014 సంవత్సరంలో గీతామాధురి, నందు వివాహం జరగగా ఈ జోడీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. గీతామాధురి పాడిన పాటలలో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి.

ఒక కేసులో తన తప్పేం లేకపోయినా పేరు వినిపించడం గురించి నందు ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. తాను తప్పు చేసినట్టు ఎన్నో వార్తలు వేశారని ఆ వార్త నిజం కాదని ఒక్క లైన్ స్క్రోలింగ్ వేశారని ఆయన చెప్పుకొచ్చారు. గీతామాధురి, నందు జోడీ సూపర్ జోడీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. గీతా మాధురి, నందు రెమ్యునరేషన్లు భారీ రేంజ్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది.

గీతామాధురి, నందులను (Nandu) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. నందు మల్టీ టాలెంటెడ్ కాగా రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా నందుకు మరిన్ని విజయాలు సొంతం కావాలని, క్రేజ్ మరింత పెరగాలని ఆశిద్దాం. నందు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus